Etela Rajender: నాలుగో రౌండ్ లో ఈటలకు భారీ ఆధిక్యం
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. వరుస రౌండ్లలో ఆయనకు ఆధిక్యం లభించింది. నాలుగో రౌండ్ లో ఆయన భారీ ఆధిక్యం సాధించారు. నాలుగో రౌండ్ లో 1,695 ఓట్ల మెజారిటీ పొందారు. మొత్తంగా ఈటలకు 2,958 ఓట్ల ఆధిక్యం లభించింది. నాలుగు రౌండ్లు కలిపి ఈటలకు 17,838 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు 16,134 ఓట్లు వచ్చాయి.