Crime News: గ‌త రాత్రి అదృశ్య‌మైన విశాఖ బాలిక.. చివరికి విగ‌త‌జీవిగా కనపడిన వైనం

  • విశాఖ‌లోని అగనంపూడిలోని శనివాడలో ఘ‌ట‌న‌
  • అపార్ట్‌మెంటు వ‌ద్ద ప‌నిచేసుకుంటూ ఉపాధి పొందుతోన్న‌ బాలిక‌ కుటుంబం
  • బాలిక‌ మృతదేహంతో కుటుంబ స‌భ్యులు, స్థానికుల ఆందోళన
girl death in vizag

గ‌త రాత్రి అదృశ్య‌మైన ఓ బాలిక అపార్ట్‌మెంట్ వ‌ద్ద విగ‌త‌జీవిగా క‌న‌ప‌డ‌డం విశాఖ‌లోని అగనంపూడి, శనివాడలో అల‌జ‌డి రేపింది. నిన్న రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద 13 ఏళ్ల ఓ బాలిక క‌న‌ప‌డ‌కుండా పోయింది. ఆమె కోసం కుటుంబ స‌భ్యులు, స్థానికులు వెతక‌డం ప్రారంభించారు. చివ‌ర‌కు అపార్ట్‌మెంట్‌ వద్దే ఆ బాలిక‌ మృతదేహాన్ని గుర్తించారు.

ఆ బాలిక విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డి పేటకు చెందిన ఓ దంప‌తుల కుమార్తె. ఆ కుటుంబం ఉపాధి కోసం విశాఖ‌లోని అగనంపూడికి వ‌చ్చి ఉంటోంది. అక్క‌డే ఓ అపార్ట్‌మెంట్‌లో ఆ కుటుంబం పనిచేస్తోంది.  

ఈ ఘ‌ట‌న‌పై కూర్మన్నపాలెం పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. బాలిక‌ మృతదేహంతో కుటుంబ స‌భ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News