Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

  • కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య 28,326
  • నిన్న క‌రోనాతో 260 మంది మృతి
  • మొత్తం 4,46,918 మంది మృతి
  • కేర‌ళ‌లో 16,671 క‌రోనా కేసులు  
corona bulletin in inida

దేశంలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య 28,326గా న‌మోద‌యింద‌ని కేంద్ర‌, వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, క‌రోనా నుంచి నిన్న 26,032 మంది కోలుకున్నారు. నిన్న క‌రోనాతో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌లో 3,03,476 మంది చికిత్స పొందుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా నుంచి 3,29,02,351 మంది కోలుకున్నారు. 4,46,918 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేర‌ళ‌లో 16,671 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న‌ మృతుల సంఖ్య 120 గా న‌మోదైంది. దేశ వ్యాప్తంగా నిన్న 68,42,786   క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేశారు. అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 85,60,81,527 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.
 


 

More Telugu News