South Central Railway: కాజీపేట-కొండపల్లి మధ్య అభివృద్ధి పనులు.. పలు రైళ్ల రద్దు

  • విజయవాడ-డోర్నకల్ రైళ్లు రద్దు
  • ఆదిలాబాద్-తిరుపతి రైలు దారి మళ్లింపు
  • సికింద్రాబాద్-గుంటూరు రైళ్లు కూడా రద్దు
some trains cancelled in kazipet kondaplli section due to development work

కాజీపేట-కొండపల్లి సెక్షన్ల మధ్య జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విజయవాడ-డోర్నకల్ (07756), డోర్నకల్-విజయవాడ (07755) రైళ్లు సెప్టెంబరు 2, 3 తేదీల్లో రద్దుకాగా, ఆదిలాబాద్-తిరుపతి (07406) రైలును 4న ముద్కేడ్, నిజామాబాద్, సికింద్రాబాద్, పగిడిపల్లి, గుంటూరు, తెనాలి మీదుగా మళ్లిస్తున్నారు. గుంటూరు-సికింద్రాబాద్ (02705), సికింద్రాబాద్-గుంటూరు (02706) రైళ్లను సెప్టెంబరు 9న రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

More Telugu News