Nani: దుష్టశక్తితో పోరాటమే ప్రధానంగా 'శ్యామ్ సింగ రాయ్'

  • రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం  
  • నాని సరసన ముగ్గురు కథానాయికలు 
  • సంగీత దర్శకుడిగా మిక్కీ జె.మేయర్
  • త్వరలో విడుదల తేదీ ప్రకటన 
Shyam Singha Roy movie update

నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను రూపొందించాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాష్టియన్ కథానాయికలుగా అలరించనున్నారు.

ఈ కథ ఏ కాలానికి సంబంధించినదే అయినా, దుష్టశక్తి - దైవశక్తి మధ్య పోరాటం ప్రధానమైన అంశంగా కనిపిస్తుందని అంటున్నారు. సాయిపల్లవి పాత్రకి కొన్ని దైవశక్తులు ఉంటాయనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన గ్రాఫిక్స్ కూడా ఒక రేంజ్ లో ఉండనున్నాయని అంటున్నారు.

వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. జిషు సేన్ గుప్తా - మురళీ శర్మ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా నుంచి, త్వరలోనే విడుదల తేదీ ప్రకటన రానుంది. తొలిసారిగా నాని టచ్ చేస్తున్న ఈ పాయింట్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.    

More Telugu News