Simha: సురేశ్ ప్రొడక్షన్స్ లో కీరవాణి తనయుడు సింహా!

  • 'మత్తువదలరా'తో పరిచయం
  • తరువాత వచ్చిన 'తెల్లవారితే గురువారం'
  • తాజా చిత్రంగా 'దొంగలున్నారు జాగ్రత్త'
  • కీలకమైన పాత్రలో సముద్రఖని  
Simha in Dongalunnaru Jagrattha movie

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు సింహా, 'మత్తువదలరా' అనే సినిమా ద్వారా ఆ మధ్య తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ సినిమా ఓ మాదిరిగా ఆడింది. ఆ తరువాత ఈ మధ్య 'తెల్లవారితే గురువారం' అనే సినిమాతోనూ ఆడియన్స్ ను పలకరించాడు. అది కూడా అదే మాట అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. గురు ఫిలిమ్స్ వారితో కలిసి సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, కొంతసేపటి క్రితం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

ఈ సినిమాకి 'దొంగలున్నారు జాగ్రత్త' అనే టైటిల్ ను ఖరారు. ఈ సినిమాతో సతీశ్ త్రిపుర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను సముద్రఖని పోషించనున్నాడు. 'అల వైకుంఠపురములో' .. 'క్రాక్' సినిమాలలో ప్రతినాయకుడిగా సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. ఈ సినిమాలో కూడా ఆయన చేసేది ప్రతినాయక పాత్రేనని అనుకోవచ్చు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమాతో హీరోగా సింహా నిలబడిపోతాడేమో చూడాలి.

More Telugu News