R Krishnaiah: దేశంలో నెంబర్ వన్ సీఎం జగన్: ఆర్‌.కృష్ణయ్య

  • దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి
  • రాజ్యసభలో బీసీ బిల్లు ప్రవేశపెట్టిన ఘనత వైసీపీదే
  • వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కూడా బిల్లును పెడతామని జగన్ చెప్పారు
Jagan is No 1 CM says R Krishnaiah

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు. దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ... రాజ్యసభలో బీసీ బిల్లును ప్రవేశ పెట్టిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఆయన అన్నారు. మన దేశంలో నెంబర్ వన్ సీఎం జగన్ అని కితాబునిచ్చారు.

ఇటీవల జగన్ తో తాను సమావేశమయ్యానని... వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కూడా బీసీ బిల్లును పెడతామని జగన్ తనకు హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తున్న 10 వేల మంది టీచర్లకు 7 నెలల జీతాలను వెంటనే చెల్లించడంతో పాటు, వీరిని రెన్యువల్ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాదులో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News