Bengaluru: బెంగళూరులో రద్దీ రోడ్డుపై దారుణం.. ఓ వ్యక్తిని నరికి చంపిన దుండగులు

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • అందరూ చూస్తుండగానే దారుణం
  • పాత కక్షలే కారణమన్న పోలీసులు
six men killed a man in day light in Bengalugu

బెంగళూరులో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆరుగురు వ్యక్తులు కలిసి అతడిని నరికి చంపారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరగ్గా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్నాయి.

రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు ఎక్కేందుకు వస్తున్న వ్యక్తిపై అక్కడే కాపుకాసిన దుండగులు హఠాత్తుగా దాడిచేశారు. కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. ఆ సమయంలో వాహనాలతో రోడ్డు రద్దీగా ఉంది. బాధితుడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు తాపీగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడిని లక్కసంద్రకు చెందిన మదన్‌గా గుర్తించారు. పాత కక్షలే హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News