Kurnool District: విషం తాగి ఒకే కుటుంబంలో న‌లుగురి ఆత్మ‌హ‌త్య‌

  • ఇటీవ‌ల స‌న్నిహితులు, బంధువులు మ‌ర‌ణించార‌ని మ‌న‌స్తాపం
  • ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేస్తోన్న పోలీసులు
  • మృతుల్లో దంప‌తులు ప్ర‌తాప్, హేమ‌ల‌త‌
  • కుమారుడు జ‌యంత్‌, కుమార్తె రిషిత‌
family commits suicide

క‌ర్నూలులో తీవ్ర విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. విషం తాగి ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఇటీవ‌ల స‌న్నిహితులు, బంధువులు మ‌ర‌ణించడంతోనే ఆ కుటుంబం మ‌న‌స్తాపానికి గురైంద‌ని ఆత్మ‌హ‌త్య లేఖ ద్వారా పోలీసులు గుర్తించారు.  

మృతుల్లో దంప‌తులు ప్ర‌తాప్, హేమ‌ల‌తతో పాటు వారి కుమారుడు జ‌యంత్‌, కుమార్తె రిషిత ఉన్నార‌ని పోలీసులు చెప్పారు. ప్ర‌తాప్ టీవీ మెకానిక్ గా ప‌నిచేస్తున్నాడ‌ని వారు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

More Telugu News