Corona Virus: దేశంలో మరింతగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త‌గా 60,471 కేసుల నమోదు

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,95,70,881
  • నిన్న‌ 2,726  మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 3,77,031
  • 25,90,44,072 మందికి వ్యాక్సిన్లు  
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య 75 రోజుల త‌ర్వాత 61 వేల దిగువ‌కు చేరింది. నిన్న 60,471 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 1,17,525 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,70,881కు చేరింది. మరో 2,726   మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,77,031కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,82,80,472 మంది కోలుకున్నారు. 9,13,378 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 25,90,44,072 మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 38,13,75,984 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,51,358 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News