Corona Virus: దేశంలో 72 రోజుల క‌నిష్ఠ స్థాయికి కొత్త‌ క‌రోనా కేసులు

  • నిన్న 70,421 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410
  • మృతుల సంఖ్య మొత్తం 3,74,305
  • మొత్తం 25,48,49,301 మందికి వ్యాక్సిన్లు  
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో కొత్త‌ క‌రోనా కేసుల సంఖ్య 72 రోజుల త‌ర్వాత 71 వేల దిగువ‌కు చేరింది. నిన్న 70,421 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 1,19,501 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,10,410కు చేరింది. మరో 3,921  మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,74,305కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,81,62,947 మంది కోలుకున్నారు. 9,73,158  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 25,48,49,301 మందికి వ్యాక్సిన్లు వేశారు.
        
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం  37,96,24,626 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 14,92,152 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.  

More Telugu News