కొత్త ప్రాజెక్టుతో రంగంలోకి దిగుతున్న కమల్!
- ముదురుతున్న 'ఇండియన్ 2' వివాదం
- 'విక్రమ్' ప్రాజెక్టును పక్కన పెట్టిన కమల్
- 'దృశ్యం 2' తమిళ రీమేక్ కి సన్నాహాలు
- రంగంలోకి దర్శకుడు జీతూ జోసెఫ్
ఒకవేళ 'విక్రమ్' సినిమాను మొదలుపెట్టిన తరువాత, 'ఇండియన్ 2' మూవీ షూటింగ్ మొదలైతే 'విక్రమ్' షూటింగు ఆపుకోవలసి వస్తుంది. పెద్ద ఆర్టిస్టుల డేట్స్ కావలసినప్పుడు దొరకవు. అందువలన కమల్ 'విక్రమ్' ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టేసి, తమిళంలో 'దృశ్యం 2' రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట. దర్శకుడు జీతూ జోసెఫ్ మలయాళ .. తెలుగు భాషల్లో ఈ సినిమాను 40 రోజుల్లో పూర్తిచేశారు. అందువలన ఆయనతో కలిసి ఈ సీక్వెల్ చేయడానికి కమల్ రెడీ అవుతున్నారని అంటున్నారు. తమిళంలో 'దృశ్యం' మొదటిభాగంలో కమల్ తో పాటు గౌతమి .. నివేదా థామస్ నటించారు.