Corona Virus: దేశంలో తగ్గుతున్న కొవిడ్ కేసులు.. నిన్న కూడా లక్ష లోపే నమోదు

Media Bulletin on status of positive cases COVID19 in india
  • నిన్న 92,596 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,90,89,069
  • 23,90,58,360 మందికి వ్యాక్సిన్లు  
  • మొత్తం 37,01,93,563 కరోనా పరీక్షలు
దేశంలో రోజువారీ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. నిన్న 92,596 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 1,62,664 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,90,89,069కు చేరింది. మరో 2,219 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,53,528కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,75,04,126 మంది కోలుకున్నారు. 12,31,415 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 23,90,58,360 మందికి వ్యాక్సిన్లు వేశారు.
           
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 37,01,93,563 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,85,967 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Corona Virus
COVID19
India

More Telugu News