Corona Virus: దేశంలో 63 రోజుల త‌ర్వాత ల‌క్ష క‌న్నా త‌క్కువ‌గా న‌మోదైన రోజువారీ కేసులు

  • కొత్త‌గా 86,498 కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,89,96,473
  • మృతుల సంఖ్య మొత్తం 3,51,309
  • 23,61,98,726 మందికి వ్యాక్సిన్లు  
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో 63 రోజుల త‌ర్వాత తొలిసారి ల‌క్ష క‌న్నా త‌క్కువ‌గా రోజువారీ కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో మొన్న‌ 1,00,636 క‌రోనా కేసులు నమోదు కాగా, నిన్న 86,498 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 1,82,282 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,89,96,473కు చేరింది. మరో 2,123 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,51,309కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,73,41,462  మంది కోలుకున్నారు. 13,03,702  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 23,61,98,726 మందికి వ్యాక్సిన్లు వేశారు.
            
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 36,82,07,596 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,73,485 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News