Corona Virus: దేశంలో మ‌రికాస్త త‌గ్గిన కొత్త క‌రోనా కేసులు

  • నిన్న 1,00,636 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,09,975
  • నిన్న 2,427  మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం  3,49,186  
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో నిన్న 1,00,636 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 1,74,399  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. మరో 2,427 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,49,186 కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,71,59,180 మంది కోలుకున్నారు. 14,01,609 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 23,27,86,482 మందికి వ్యాక్సిన్లు వేశారు.
             
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 36,63,34,111 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 15,87,589 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News