Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

  • నిన్న 1,14,460  క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,09,339
  • మృతుల సంఖ్య మొత్తం 3,46,759  
  • 23,13,22,417 మందికి వ్యాక్సిన్లు  
  Media Bulletin on status of positive cases COVID19 in india

భార‌త్‌లో నిన్న 1,14,460 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 1,89,232  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,09,339కు చేరింది. మరో 2677 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,46,759 కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,69,84,781 మంది కోలుకున్నారు. 14,77,799  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 23,13,22,417 మందికి వ్యాక్సిన్లు వేశారు.
       
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం  36,47,46,522  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 20,36,311 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News