anandaiah: ఆనంద‌య్య కరోనా మందు త‌యారీకి చ‌క‌చ‌కా ఏర్పాట్లు.. మందు పేరు ‘ఔషధచక్ర’?

  • అవ‌స‌ర‌మైన సామ‌గ్రి కృష్ణ‌ప‌ట్నం పోర్టుకు త‌ర‌లింపు
  • సీవీఆర్‌ కాంప్లెక్స్‌లో మూలిక‌లు, దినుసులు
  • రెండురోజుల్లో మందు తయారీ ప్రారంభం
anandaiah to distribute medicine

క‌రోనా రోగుల‌ కోసం నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య అందిస్తున్న మందుకు ఏపీ స‌ర్కారు అనుమ‌తులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీన్ని ఆన్‌లైన్ ద్వారా కూడా పంపిణీ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ ఔష‌ధానికి ‘ఔషధచక్ర’ అని పేరు పెట్టిన‌ట్లు స‌మాచారం. ఆనంద‌య్య మందు త‌యారీ పెద్ద ఎత్తున ప్రారంభ‌మవుతోంది.

కృష్ణ‌ప‌ట్నం పోర్టు వ‌ద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌యారీకి అవ‌స‌ర‌మైన సామ‌గ్రిని కృష్ణ‌ప‌ట్నం పోర్టుకు త‌ర‌లించే ప‌నులు మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం కృష్ణపట్నం పోర్టుకు చెందిన సీవీఆర్‌ కాంప్లెక్స్‌లో మూలిక‌లు, దినుసులు సిద్ధం చేసుకోవడంలో ఆనందయ్య బృందం బిజీగా ఉంది.

వీటి సేకరణ పూర్తయిన తర్వాత రెండురోజుల్లో మందు తయారీ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి సూచన మేరకు మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షమందికి కరోనా రానివారు వాడే మందును అందజేయాలని ఆనంద‌య్య బృందం నిర్ణ‌యించింది. అనంత‌రం కరోనా రోగులకు అవసరమైన ‘పి, ఎల్, ఎఫ్‌’ రకాల మందు పంపిణీ చేస్తారు. ఆ త‌ర్వాతే ఇతర నియోజకవర్గాలకు పంపిణీ చేయ‌నున్నారు.

More Telugu News