Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు

  • నిన్న 1,34,154 మందికి క‌రోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,84,41,986
  • మృతుల సంఖ్య మొత్తం  3,37,989
  • 22,10,43,693 మందికి వ్యాక్సిన్లు  
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో  నిన్న 1,34,154 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. వాటి ప్రకారం... నిన్న  2,11,499  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,84,41,986కు చేరింది. మరో  2,887మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం  3,37,989కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,63,90,584 మంది కోలుకున్నారు. 17,13,413 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 22,10,43,693 మందికి వ్యాక్సిన్లు వేశారు.
       
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం  35,37,82,648 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 21,59,873  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News