Allu Arjun: 'పుష్ప'కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి!

  • ముగింపు దశలో 'పుష్ప'
  • దసరాకి రిలీజ్ చేసే ఛాన్స్
  • ఓవర్సీస్ మార్కెట్ లోను జోరు
  • ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్
Highest craze for Pushpa movie in overseas

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తొలి భాగానికి సంబంధించిన షూటింగు కొంతవరకే మిగిలిఉంది. కరోనా ప్రభావం తగ్గగానే చకచకా షూటింగును పూర్తిచేయాలనే ప్లానింగుతోనే ఉన్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ గురించిన వార్త జోరుగా షికారు చేస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ డీల్ పూర్తయిందని అంటున్నారు. ఓవర్సీస్ కి సంబంధించి అల్లు అర్జున్ కెరియర్లోనే అత్యధిక ధరకి అమ్ముడైన సినిమా ఇదేనని చెబుతున్నారు. అల్లు అర్జున్ లుక్ నుంచి ప్రతి అంశం క్రేజ్ ను పెంచుతూ వెళ్లడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

More Telugu News