petrol: మ‌రికాస్త పెరిగిన‌ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

  • పెట్రోలుపై 26 పైసలు, డీజిల్ పై 34 పైసల పెంపు
  • ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.91.53
  • హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోలు ధ‌ర‌ రూ.95.13
  • లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.47
Petrol price up by 26 paise diesel by 34 paise

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ రోజు లీటరు పెట్రోలు ధ‌ర‌ 26 పైసలు, డీజిల్ 34 పైసల చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.91.53, డీజిల్ ధర రూ.82.06కి చేరింది. ముంబైలో లీట‌రు పెట్రోల్ ధర  రూ.97.86, డీజిల్ ధర రూ.89.17గా ఉంది.  

చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.93.38, డీజిల్ ధ‌ర‌ రూ.86.96కి పెరిగింది. కోల్ క‌తాలో పెట్రోల్ లీట‌రుకు రూ.91.66, డీజిల్ రూ.89.17కి చేరింది. ఇక‌, హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోలు ధ‌ర‌ రూ.95.13కి పెర‌గ‌గా, లీటర్‌ డీజిల్‌ రూ.89.47కి చేరింది.

More Telugu News