Allu Arjun: 'పుష్ప' రెండు భాగాలుగా రానుందంటూ రూమర్!

  • స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ
  • ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్
  • గ్రామీణ యువతిగా రష్మిక
  • నిడివి పెరగనుందంటూ టాక్  

Pushpa is going to release as two parts

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ 'పుష్ప' సినిమాను రూపొందిస్తున్నాడు. అడవి నుంచి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించే నేపథ్యం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా నటిస్తున్న ఈ సినిమాలో, ఆయన సరసన ఆడిపాడే గ్రామీణ యువతిగా రష్మిక అలరించనుంది. ఆయన చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేశ్ ఆకట్టుకోనుంది. ఇక ప్రతినాయకుడి పాత్రలో ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, ఊర్వశీ రౌతేలా ఐటమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం 35 కోట్లు ఖర్చు అయినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.

ఉత్కంఠభరితమైన కథాకథనాలతో .. ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా నడుస్తుంది. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. దీంతో ఈ సినిమా నిడివి పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. అయితే తాను చెప్పదలచుకున్న విషయాన్ని తగ్గించి చెప్పడం వలన ఇంపాక్ట్ పోతుందని భావించిన సుకుమార్, రెండు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. ఒక భాగాన్ని దసరాకి విడుదల చేసి, మరో భాగాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాడని అంటున్నారు.

More Telugu News