Crime News: త‌మ అమ్మాయితో చ‌నువుగా ఉంటున్నాడ‌ని అబ్బాయి కాళ్లు, చేతులు న‌రికిన వైనం.. మృతి

  • గుంటూరులో దారుణ ఘ‌ట‌న
  • ఆసుప‌త్రిలో కొన్ని రోజులుగా అబ్బాయికి చికిత్స‌
  • నిందితుల‌పై క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అబ్బాయి బంధువుల డిమాండ్
man killed by lover kin

గుంటూరులో దారుణ ఘ‌ట‌న వెలుగు చూసింది.  పెద‌కాకాని మండ‌లం కొప్పురావూరు గ్రామానికి చెందిన‌ ఓ అమ్మాయితో ఓ అబ్బాయి చ‌నువుగా ఉండేవాడు. ఆమెతో ప‌దే ప‌దే మాట్లాడేవాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన ఆ అమ్మాయి కుటుంబస‌భ్యులు అబ్బాయిని ప‌ట్టుకుని అత‌డి కాళ్లు, చేతులు న‌రికేశారు. అనంత‌రం అత‌డిని కొందరు ఆసుప‌త్రిలో చేర్పించారు.

కొన్ని రోజుల నుంచి చికిత్స తీసుకుంటోన్న ఆ అబ్బాయి ఈ రోజు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిపేరు వెంక‌టేశ్ గా పోలీసులు గుర్తించారు. త‌మ అబ్బాయిని చంపిన యువ‌తి కుటుంబస‌భ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వెంక‌టేశ్ కుటుంబస‌భ్యులు కోరుతున్నారు. ఈ కేసులో పోలీసులు త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగిస్తున్నారు.

More Telugu News