MS Dhoni: క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్‌ ధోనీ తల్లిదండ్రుల‌కు క‌రోనా

  • ఆసుప‌త్రిలో చేరిన ధోనీ త‌ల్లిదండ్రులు
  • ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌న్న వైద్యులు
  • ప్ర‌స్తుతం ఐపీఎల్ మ్యాచులు ఆడుతోన్న ధోనీ
dhoni

క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్‌ ధోనీ తల్లిదండ్రుల‌కు క‌రోనా సోకింది. దీంతో వారిని ఆసుప‌త్రిలో చేర్పించారు. ధోనీ తల్లిదండ్రుల పేర్లు  దేవ‌కీ దేవి, పాన్ సింగ్. ప్ర‌స్తుతం వారికి రాంచీలోని 'ప‌ల్స్' సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్లు వైద్యులు చెప్పారు.

ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఆడుతోన్న ధోనీ ముంబైలో ఉన్న విష‌యం తెలిసిందే. నేడు చెన్నై సూప‌ర్ కింగ్స్‌ , కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. చెన్నై టీమ్‌కి ధోనీ సార‌థ్యం వ‌హిస్తున్నాడు.

More Telugu News