MS Dhoni: నిన్న‌టి మ్యాచ్‌లో త‌న ప్ర‌ద‌ర్శ‌న‌పై ధోనీ స్పంద‌న‌!

  • రాజస్థాన్ రాయల్స్‌పై  చెన్నై సూపర్ కింగ్స్ విజయం
  • 18 పరుగులు మాత్ర‌మే చేసిన ధోనీ
  • నెమ్మదిగా ఆడటం త‌న జ‌ట్టుకు నష్టం కలిగిస్తుందని వ్యాఖ్య‌
  • ఈ విష‌యాన్ని తాను అంగీకరిస్తున్నానన్న ధోనీ
dhoni on his performance

ముంబైలోని వాంఖడే స్టేడియంలో గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్  మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచులో కెప్టెన్ ధోనీ 18 పరుగులు మాత్ర‌మే చేశాడు. త‌న బ్యాటింగ్ తీరుపై ధోనీ మాట్లాడుతూ...  తాను నెమ్మదిగా ఆడటం త‌న జ‌ట్టుకు నష్టం కలిగిస్తుందని, ఈ విష‌యాన్ని తాను అంగీకరిస్తున్నానని తెలిపాడు.

అయితే, ఎల్లప్పుడూ మంచి ప్రదర్శనే చేస్తానని తాను భ‌రోసా ఇవ్వ‌లేన‌ని చెప్పాడు. క్రికెట్‌ మెరుగ్గా ఆడుతున్నప్పుడు అన్‌ఫిట్‌ అని ఏ ఒక్కరూ అనరని ఆయ‌న చెప్పాడు. ప్రదర్శన అనేది హామీ ఇవ్వలేని విష‌య‌మ‌ని, తాను 24 ఏళ్ల వయసులోనూ బాగా రాణిస్తానని అప్పుడు హామీ ఇవ్వలేదని తెలిపాడు. ప్ర‌స్తుతం త‌న‌ వయసు 40 ఏళ్లని, తాను ఇప్పుడు కూడా ఆ హామీ ఇవ్వలేనని వ్యాఖ్యానించాడు.

More Telugu News