'వకీల్ సాబ్' విషయంలో క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
- ఓటీటీలో 'వకీల్ సాబ్' అంటూ ప్రచారం
- పుకార్లపై స్పందించిన దిల్ రాజు
- వీడియో రూపంలో ఇచ్చిన స్పష్టత
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఈ నెల 23వ తేదీ నుంచి ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దాంతో ఈ విషయంపై నిర్మాత 'దిల్'రాజు స్పందిస్తూ ఒక వీడియో వదిలారు. "తెలుగువారందరికీ 'ప్లవ'నామ ఉగాది శుభాకాంక్షలు. 'వకీల్ సాబ్'ను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. 'వకీల్ సాబ్' ఓటీటీలో వచ్చేస్తోందనే చిన్న రూమర్ రన్ అవుతోంది. పెద్ద స్టార్ సినిమా ఏదైనా 50 రోజుల తరువాతనే ఓటీటీలో వస్తుంది. అలాగే 'వకీల్ సాబ్' కూడా 50 రోజుల తరువాతనే ఓటీటీలో వస్తుంది.
ఒక పెద్ద సినిమాను థియేటర్లలో చూసేటప్పుడు కలిగే అనుభూతి, టీవీలలో .. ఫోన్లలో చూడటం వలన కలగదు. అందరూ కూడా సాధ్యమైనంత వరకూ థియేటర్లలోనే చూడటానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ కోవిడ్ కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను చూడండి. చూసినవాళ్లు అభినందిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇకపై కూడా మంచి సినిమాలను అందించడానికి అవసరమైన ఉత్సాహాన్ని 'వకీల్ సాబ్' నాకు ఇచ్చింది .. అందరికీ మరోసారి ధన్యవాదాలు " అంటూ చెప్పుకొచ్చారు.