ఆసుపత్రిలో చేరాను.. త్వరలో వచ్చేస్తా: సచిన్ టెండూల్కర్ ట్వీట్
- ఇటీవల సచిన్కు కరోనా
- కొన్ని రోజులుగా హోం క్వారంటైన్
- వైద్యుల సలహా మేరకు ఆసుపత్రికి
'మీరు చూపుతోన్న ప్రేమకు, చేస్తోన్న ప్రార్థనలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండడంతో వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరాను. కొన్ని రోజుల్లో మళ్లీ ఇంటికి చేరుకుంటానని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలి' అని సచిన్ ట్వీట్ చేశారు.
కాగా, టీమిండియా వన్డే ప్రపంచకప్ ను కైవసం చేసుకుని నేటికి 10 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై కూడా సచిన్ స్పందించారు. భారతీయులు, టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, టీమిండియా 2011లో ప్రపంచ కప్ గెలుచుకుంది. అంతకు ముందు 1983లో టీమిండియా ప్రపంచ కప్ సాధించింది.