చెడ్డీగ్యాంగ్కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష.. నిజామాబాద్ సెషన్స్ కోర్టు తీర్పు
- నిజామాబాద్లో ఓ ఇంట్లో 15 తులాల బంగారం అపహరణ
- డిసెంబరు 2019లో రాచకొండ పోలీసులకు చిక్కిన ముఠా
- నిందితులందరూ మహారాష్ట్ర వారే
విచారణలో వారు నిజామాబాద్లోనూ దొంగతనం చేసినట్టు అంగీకరించారు. దీంతో వారిని అక్కడి పోలీసులకు అప్పగించారు. తాజాగా, ఈ కేసులో వాదనలు విన్న సెషన్స్ కోర్టు జడ్జి కిరణ్మయి ముఠాలోని ఆరుగురు సభ్యులకు ఏడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో నిందితుడు ఎండీ సాజిద్పై నేరం నిరూపణ కాకపోవడంతో అతడిపై నమోదైన కేసును కొట్టివేశారు. నిందితులందరూ మహారాష్ట్రకు చెందిన వారే.