Anupam Kher: చాన్నాళ్ల తర్వాత.. తెలుగు సినిమాలో అనుపమ్ ఖేర్!

  • 1987లో 'త్రిమూర్తులు'లో నటించిన అనుపమ్
  • చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సీక్వెల్
  • ధన్వంత్రి పాత్రలో నటించడానికి అంగీకారం  
Anupam Kher in a Telugu movie after decades

అనుపమ్ ఖేర్ ఎంతటి ప్రతిభావంతుడైన నటుడో హిందీ సినిమాలతో పరిచయం వున్న వాళ్లకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విలనీ.. కామెడీ.. పాథాస్.. క్యారెక్టర్ ఏదైనా సరే తనదైన శైలిలో అభినయించి మెప్పించే నటుడాయన. అలాంటి ఆ బాలీవుడ్ నటుడు గతంలో 1987లో వెంకటేశ్ హీరోగా కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన 'త్రిమూర్తులు' తెలుగు సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ తెలుగు సినిమాలో నటించడానికి అనుపమ్ అంగీకరించారు.

నిఖిల్ హీరోగా  చందు మొండేటి దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'కార్తికేయ' సినిమా మంచి హిట్టయింది. ఇప్పుడు దీనికి ఇదే కలయికలో సీక్వెల్ చేస్తున్నారు. ఇందులో కీలక పాత్రకు అనుపమ్ ఖేర్ ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పాత్ర నచ్చడంతో చేయడానికి ఆయన కూడా హ్యాపీగా అంగీకరించినట్టు సమాచారం. ఇందులో ఆయన ధన్వంత్రి అనే విభిన్నతరహా పాత్రను పోషిస్తున్నారట.

More Telugu News