petrol: దేశంలో నాలుగు రోజులుగా పెర‌గ‌ని పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

  • ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ 91.17
  • డీజిల్ ధర రూ.81.47
  • హైద‌రాబాద్‌లో పెట్రోలు ధ‌ర లీట‌రుకు రూ.94.79
  • డీజిల్ ధ‌ర లీట‌రుకు రూ.88.86
Petrol Diesel Price in Hyderabad

దేశంలో వ‌రుస‌గా పెరిగిపోతోన్న పెట్రోలు, డీజిల్ ధ‌రల‌కు కాస్త బ్రేక్ ప‌డింది. వరుస‌గా నాలుగో రోజు ధ‌ర‌లు పెర‌గ‌కుండా, త‌గ్గ‌కుండా స్థిరంగా ఉన్నాయి. గ‌త శ‌నివారం పెట్రోల్ ధర లీట‌రుకు 25 పైసలు, డీజిల్ ధ‌ర ధర 16 పైసలు పెరిగిన విష‌యం తెలిసిందే.  ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ 91.17, డీజిల్ ధర రూ.81.47గా ఉంది.

అలాగే, ముంబైలో పెట్రోల్ ధర లీటరు రూ.97.57, డీజిల్ ధర రూ.88.60గా ఉంది.
రాజస్థాన్‌లోని బికనేర్‌లో లీటరు పెట్రోలు ధర రూ.100.01గా ఉంది. అలాగే డీజిల్ ధ‌ర‌ 92.09గా ఉంది. గ‌త నెల పెట్రోల్ ధర లీటరు‌కు రూ. 4.87, డీజిల్ ధర రూ.4.99కి  పెరిగింది. హైద‌రాబాద్‌లో పెట్రోలు ధ‌ర లీట‌రుకు రూ.94.79గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర లీట‌రుకు రూ.88.86గా కొన‌సాగుతోంది.

More Telugu News