Vijay Sai Reddy: ఏ రోటికాడ ఆ పాట, ఏ ఎండకాగొడుగు పట్టడమంటే ఇదే!: విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా

  • డీజీపీకి అప్పటి గవర్నర్ ఫోన్ చేస్తే సీఎంగా ఉన్న‌ చంద్ర‌బాబు చిందులేశాడు
  • ఇప్పుడేమో ఉద్యోగులను గవర్నర్ నియంత్రించాలట
  • మాట మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం
vijaya sai slams chandrababu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైసీపీ నేత‌ల‌పై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేస్తోన్న విమర్శ‌ల‌కు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. చంద్ర‌బాబు నాయుడు గ‌తంలో సీఎంగా ఉన్న‌ప్పుడు ఒక‌లా ప్ర‌వ‌ర్తించి, ఇప్పుడు మ‌రోలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

'ఏ రోటికాడ ఆ పాట- ఏ ఎండకాగొడుగు పట్టడమంటే ఇదే. డీజీపీకి అప్పటి గవర్నర్ ఫోన్ చేస్తేనే తాను సీఎంగా ఉన్నప్పుడు చిందులేశాడు. ఇప్పుడేమో ఉద్యోగులను గవర్నర్ నియంత్రించాలట? మాట మార్చడంలో ఊసరవెల్లిని మించిపోయావయ్యా చంద్రం!' అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

More Telugu News