Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 261 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 67 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 6 శాతానికి పైగా పెరిగిన యాక్సిస్ బ్యాంక్ షేర్
Stock markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. కరోనా వైరస్ ప్రజలకు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో మార్కెట్లలో ట్రేడింగ్ జోరుగా సాగింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 261 పాయింట్లు లాభపడి 48,438కి పెరిగింది. నిఫ్టీ 67 పాయింట్లు పుంజుకుని 14,200 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (6.31%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.78%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.68%), టీసీఎస్ (1.75%) టైటాన్ కంపెనీ (1.17%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-2.06%), బజాజ్ ఫైనాన్స్ (-1.83%), ఎన్టీపీసీ (-1.31%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.24%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.23%).

More Telugu News