Corona Virus: తెలంగాణలో గత 24 గంటల్లో 415 కరోనా కేసులు‌!

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,354
  • గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురి మృతి  
  • కోలుకున్న వారు 2,78,839 మంది
  • జీహెచ్ఎంసీలో కొత్తగా 91 కరోనా కేసులు  
new  415 COVID19 infections in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 415 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 316 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,86,354కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,78,839 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,541కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 5,974 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,823 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 91 కరోనా కేసులు నమోదయ్యాయి.

 

More Telugu News