Corona Virus: తెలంగాణలో కొత్తగా 397 కరోనా కేసులు

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,465
  • కోలుకున్న వారు 2,77,931 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,535
  • జీహెచ్ఎంసీలో కొత్తగా  92 కరోనా కేసులు  
new  397 COVID19 infections in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో 397 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 627 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,465కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,77,931 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,535కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 5,999 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 3,838 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా  92 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా కేసుల పూర్తి వివరాలు..
 

More Telugu News