Corona Virus: తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్!

  • 24 గంటల్లో 205 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,068
  • కోలుకున్న వారు 2,77,304 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,533
new  205 COVID19 infections in telangana

తెలంగాణలో గత 24 గంటల్లో 205 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 551 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,068కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,77,304 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,533కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,231 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో4,136 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా  54 కరోనా కేసులు నమోదయ్యాయి.

  

More Telugu News