Chandrababu: టీడీపీ ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

Chandrababu has taken key decisions
  • పార్టీ పరంగా కీలక చర్యలు తీసుకున్న చంద్రబాబు
  • టీడీపీ ముఖ్యులకు ప్రత్యేక బాధ్యతల కేటాయింపు
  • 25 లోక్ సభ నియోజకవర్గాలను ఐదు జోన్లుగా విభజన
  • ఒక్కో ప్రధాన కార్యదర్శికి ఒక్కో జోన్ బాధ్యతలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలను 5 జోన్లుగా విభజించి... ఒక్కొక్కరికి 5 లోక్ సభ నియోజకవర్గాల చొప్పున ఐదుగురికి ప్రత్యేక బాధ్యతలు కేటాయించారు.

  • బుద్ధా వెంకన్న- అరకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి. 
  • పంచుమర్తి అనురాధ- నరసాపురం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం.
  • చెంగల్రాయుడు-గుంటూరు, విజయవాడ, బాపట్ల, మచిలీపట్నం, నరసరావుపేట.
  • అనగాని సత్యప్రసాద్- తిరుపతి, చిత్తూరు, రాజంపేట, ఒంగోలు, నెల్లూరు.
  • అమర్ నాథ్ రెడ్డి- కర్నూలు, అనంతపురం, కడప, హిందూపురం, నంద్యాల

కాగా, మాజీ మంత్రి దేవినేని ఉమకు ఇతర రాజకీయ పార్టీలతో సమన్వయ బాధ్యతలు అప్పగించారు. పయ్యావుల కేశవ్ కు అధికార ప్రతినిధులపై పర్యవేక్షణ బాధ్యతలు కేటాయించారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామికి 25 లోక్ సభ నియోజకవర్గాల నుంచి వచ్చే నివేదికలు పరిశీలించే బాధ్యతలు అప్పగించారు.
Chandrababu
Lok Sabha
Zone
Telugudesam
Andhra Pradesh

More Telugu News