Budda Venkanna: చివరకు మరుగుదొడ్డికి కూడా పన్ను వేస్తావా?: బుద్ధా వెంకన్న

budda venkanna slams   jagan
  • ప్రజలపై భారాలు వెయ్యం అని చించుకుని చెప్పావ్
  • ఇప్పుడు పెట్రోల్ రేట్లు, బస్ ఛార్జీలు పెంచావు
  • సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నావ్
  • పిచ్చి బ్రాండులు తెచ్చి ప్రజల మీద వేస్తావా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ప్రజలపై పన్నుల భారం వేస్తూ వారిని ఇబ్బందుల్లో నెడుతున్నారని చెప్పారు. ‘ప్రజలపై భారాలు వెయ్యం అని చించుకుని చెప్పావ్, ఇప్పుడు పెట్రోల్ రేట్లు, బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, చివరకు మరుగుదొడ్డికి కూడా పన్ను వేస్తావా?’ అని నిలదీస్తూ బుద్ధా వెంకన్న ట్వీట్లు చేశారు.  

‘సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నావ్, పిచ్చి బ్రాండులు తెచ్చి ప్రజల మీద వేస్తావా?’ అంటూ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. హ్యాపీ బర్త్ డే ఫేక్ సీఎం అని ఆయన హ్యాష్ ట్యాగ్ జోడించారు. జగన్ తీసుకొచ్చిన మద్యం బ్రాండుల ఫొటోలను ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న పోస్ట్ చేశారు.
Budda Venkanna
Telugudesam
YSRCP

More Telugu News