Chandrababu: ఆంధ్రప్రదేశ్ డీజీపీకి చంద్రబాబు నాయుడు లేఖ!

  • తంబళ్లపల్లెలో దాడి ఘటనపై ఆందోళన
  • రాష్ట్రంలో అరాచక పాలన
  • దాడులు, దౌర్జన్యాలతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు
  • అవినీతి మాఫియా శక్తులు స్వైర విహారం చేస్తున్నాయి
chandra babu writes letter to dgp

ఆంధ్రప్రదేశ్ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరో లేఖ రాశారు. తంబళ్లపల్లెలో దాడి ఘటనపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు  దాడులు చేస్తున్నారని చెప్పారు. దాడులు, దౌర్జన్యాలతో వైసీపీ నేతలు ప్రజాస్వామ్యానికి గండికొడుతున్నారని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి మాఫియా శక్తులు స్వైర విహారం చేస్తున్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చట్టబద్ధమైన పాలన స్థానంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని, దాడిని వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్నా పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారని చెప్పారు.

మంత్రి పెద్దిరెడ్డి అరాచక శక్తులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ చర్యలు ఇలాగే కొనసాగుతూ పోతే ప్రజలకు పోలీసు వ్యవస్థపై ఉన్న నమ్మకం పోతుందని తెలిపారు. కాగా, చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో నిన్న టీడీపీ నేతల పర్యటన నేపథ్యంలో వారి వాహనాలపై కొందరు కర్రలు, రాళ్లతో దాడి చేశారు.

More Telugu News