BCCI: భారత్ లో పర్యటించనున్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు... వేదికలు ఖరారు

  • ఫిబ్రవరి 5 నుంచి భారత్ లో ఇంగ్లాండ్ టూర్
  • 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న ఇంగ్లాండ్
  • కరోనా వ్యాప్తి కారణంగా కేవలం 3 వేదికల్లోనే మ్యాచ్ లు
  • చెన్నై, అహ్మదాబాద్, పుణే నగరాల్లో మ్యాచ్ లు
  • సంయుక్త ప్రకటన చేసిన బీసీసీఐ, ఈసీబీ
BCCI and ECB finalized the tour venues

వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సుదీర్ఘ పర్యటన కోసం భారత్ రానుంది. ఈ పర్యటనలో మ్యాచ్ లు జరిగే వేదికలను ఖరారు చేసినట్టు బీసీసీఐ, ఈసీబీ (ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ సిరీస్ లో టీమిండియా, ఇంగ్లాండ్ 4 టెస్టులు, 5 టీ20 మ్యాచ్ లు, 3 వన్డేలు ఆడనున్నాయి. అయితే, మ్యాచ్ ల సంఖ్య ఎక్కువగానే ఉన్నా కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని కేవలం మూడు వేదికలనే ఎంపిక చేశారు. కేవలం చెన్నై, అహ్మదాబాద్, పుణే నగరాల్లోనే మ్యాచ్ లు జరగనున్నాయి.

టెస్ట్ సిరీస్ ఫిబ్రవరి 5న ప్రారంభమై మార్చి 8న ముగుస్తుంది. తొలి రెండు టెస్టులు చెన్నైలో, ఆ తర్వాతి రెండు టెస్టులు అహ్మదాబాద్ లో నిర్వహిస్తారు. ఇక టీ20 సిరీస్ మార్చి 12న ప్రారంభం కానుండగా, అన్ని మ్యాచ్ లు అహ్మదాబాద్ లో జరుగుతాయి. అనంతరం, మార్చి 23న వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ మ్యాచ్ లన్నీ పుణేలో నిర్వహిస్తారు. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు.

More Telugu News