Rajasthan: రాజస్థాన్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

  • పంచాయతీ ఎన్నికల్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్
  • మంత్రి ఇలాఖాలోనూ కాంగ్రెస్ ఓటమి
  • ఇది వ్యవసాయ చట్టాలకే ప్రజలు వేసిన ఓటన్న జేపీ నడ్డా
Congress defeated in panchayat elections in Rajasthan

రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ దూసుకుపోగా, కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం 4,371 పంచాయతీ సమితులకు 4 దశల్లో ఎన్నికలు నిర్వహించగా నిన్న ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 1,989 స్థానాలను దక్కించుకోగా, కాంగ్రెస్ 1,852 స్థానాలతో సరిపెట్టుకుంది. సీపీఎం 26, ఆర్ఎల్‌పీ 6, బీఎస్పీ 5 స్థానాల్లో విజయం సాధించింది.

అలాగే, జిల్లా పరిషత్ స్థాయిలో 635 స్థానాలకు గాను బీజేపీ 353 స్థానాలను దక్కించుకోగా, కాంగ్రెస్ 252 స్థానాలకే పరిమితమైంది. అలాగే, 21 జిల్లా బోర్డుల్లో బీజేపీ 13, కాంగ్రెస్ ఐదు స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు, మంత్రి గోవింద్ సింగ్ టోటాసరా సొంత జిల్లాలోనూ కాంగ్రెస్ పరాజయం పాలవడం గమనార్హం. ఈ విజయంపై బీజేపీ చీఫ్ నడ్డా మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు కోట్లాదిమంది మద్దతు తెలుపుతున్నారని ఈ ఫలితాలు నిరూపించాయన్నారు.

More Telugu News