Corona Virus: ఏపీ కరోనా బులెటిన్: 1,886 పాజిటివ్ కేసులు, 12 మరణాలు

Corona cases and deaths of Andhra Pradesh
  • గత 24 గంటల్లో 67,910 టెస్టులు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 291 కేసులు
  • యాక్టివ్ కేసుల సంఖ్య 20,958
ఏపీలో ఇవాళ కూడా 2 వేల లోపే కొత్త కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 67,910 కరోనా టెస్టులు నిర్వహించగా, 1,886 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 291 కేసులు వచ్చాయి. అత్యల్పంగా కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో 33 కేసుల చొప్పున గుర్తించారు. ఇక, రాష్ట్రంలో మరో 12 మంది కరోనాతో కన్నుమూశారు. తాజాగా 2,151 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఏపీలో ఇప్పటివరకు 8,46,245 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,18,473 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,958 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 6,814కి పెరిగింది.
Corona Virus
Andhra Pradesh
Positive Cases
Deaths

More Telugu News