Amit Shah: హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు మోదీ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఇది: అమిత్ షా

  • సట్లెజ్ నదిపై 210 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
  • రూ. 1,810 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం
  • ప్రాజెక్టు వల్ల ఏడాదికి 758.20 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి
This is big gift to people of Himachal Pradesh by Modi says Amit Shah

హిమాచల్ ప్రదేశ్ లో సట్లెజ్ నదిపై 210 మెగావాట్ల లూహ్రీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదముద్ర వేసింది. రూ. 1,810 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్ ఇదని అన్నారు. ఈ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఎంతో మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తాయని చెప్పారు. మరోవైపు ఈ ప్రాజెక్టు వల్ల ఏడాదికి 758.20 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయనున్నారు.

More Telugu News