Counselling: ఈ నెల 23 నుంచి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్

  • ఇటీవలే విడుదలైన ఎంసెట్ ఫలితాలు
  • అక్టోబరు 26 వరకు కౌన్సెలింగ్
  • నోటిఫికేషన్ విడుదల
AP EAMCET Counselling notification

ఇటీవలే ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఈ నెల 23 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక విద్య విభాగం ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంసెట్ లో అర్హత సాధించిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ లో పాల్గొనవచ్చు. ఈ వెబ్ కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు తేదీలను తర్వాత ప్రకటించనున్నారు.

కౌన్సెలింగ్ తేదీలు ఇవే...

  • అక్టోబరు 23-  ఆంగ్లో ఇండియన్, పీహెచ్ వీ, పీహెచ్ హెచ్, పీహెచ్ఓ కేటగిరీల్లో 1 నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అదే రోజున ఎన్ సీసీ కేటగిరీలో నుంచి 35,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుంది.

  • అక్టోబరు-24- సీఏపీ కేటగిరీలో 1 నుంచి  45,000 వరకు, ఎన్ సీసీ కేటగిరీలో 35,001 నుంచి 70,000 వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 1 నుంచి 45,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

  • అక్టోబరు 25- సీఏపీ కేటగిరీలో 45,001 నుంచి 90,000 ర్యాంకు వరకు, ఎన్ సీసీ కేటగిరీలో 70,001 నుంచి 1,05,000 వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 45,001 నుంచి 90,000 వరకు కౌన్సెలింగ్ చేపడతారు.

  • అక్టోబరు 26- సీఏపీ కేటగిరీలో 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు, ఎన్ సీసీ కేటగిరీలో 1,05,001 నుంచి చివరి ర్యాంకు వరకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్ జరుపుతారు. 

More Telugu News