ఇటలీ వెళ్లనున్న నితిన్, కీర్తి సురేశ్?
- వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే'
- హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్
- ఇటలీలో సన్నివేశాలు, పాటల చిత్రీకరణ
- ఈ నెలాఖరులో ఇటలీకి ప్రయాణం
కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ సమాచారం తాజాగా అందుతోంది. కథ ప్రకారం గతంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూలును ఇటలీలో ప్లాన్ చేశారు. అయితే, కరోనా నేపథ్యంలో అప్పుడు దానిని కేన్సిల్ చేసుకుని, ఆ షూటింగును కూడా హైదరాబాదులోనే కానిచ్చేద్దామని అనుకున్నారు.
అయితే, ఇప్పుడు కరోనా పరిస్థితులు కుదుటపడుతున్న నేపథ్యంలో మళ్లీ ఇటలీలో షూటింగ్ చేయాలని భావిస్తున్నారట. అందుకే, కాస్త రిస్క్ తీసుకుని ఇటలీకి వెళ్లి కొన్ని సన్నివేశాలను, రెండు పాటలను చిత్రీకరించాలని యూనిట్ తాజాగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులో అక్కడికి వెళతారని అంటున్నారు.