SP Balasubrahmanyam: ఇదే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట!

  • ఎన్నో భాషల్లో 40 వేల పాటలు
  • చివరిగా 'పలాస 1978' వినిపించిన గొంతు
  • 'ఓ సొగసరి...' అంటూ సాగే పాట
This is the Last Song by SPB

దేశంలోని పలు భాషల్లో దాదాపు 40 వేల పాటలను పాడిన ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నిన్న మధ్యాహ్నం కానరాని లోకాలకు వెళ్లిపోగా, దక్షిణాది చిత్ర పరిశ్రమ ఓ దిగ్గజ గాయకుడిని కోల్పోయింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరెవరికీ సాధ్యంకాని చరిత్రను సృష్టించిన మన బాలూ సినిమాకు పాడిన చివరి పాట ఏంటో తెలుసా?

'పలాస 1978' సినిమా కోసం రఘు కుంచె స్వరపరిచిన 'ఓ సొగసరి...' అంటూ సాగే పాటను ఆయన పాడారు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్న రఘు, అంతటి మహానుభావుడితో పాట పాడించడం తన అదృష్టమని అన్నారు. ఎస్పీబీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, మనం ఓ గొప్ప గాయకుడిని కోల్పోయామని కన్నీరు పెట్టుకున్నారు. బాల సుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట ఇదే.

More Telugu News