'రాజుగారి గది 4'కి దర్శకుడు ఓంకార్ సన్నాహాలు!
- తెలుగులో పెరిగిన సీక్వెల్స్ నిర్మాణం
- 'రాజుగారి గది'తో దర్శకుడిగా మారిన ఓంకార్
- 'రాజుగారి గది 2'లో నటించిన నాగార్జున
ప్రముఖ టీవీ యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి, ఐదేళ్ల క్రితం 'రాజుగారి గది' పేరిట ఓ హారర్ థ్రిల్లర్ ను రూపొందించాడు. అది అనూహ్యమైన విజయం సాధించడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా 'రాజుగారి గది 2' చిత్రాన్ని నిర్మించారు. అందులో నాగార్జున కథానాయకుడుగా నటించడంతో దానికి మంచి క్రేజ్ వచ్చింది.
ఆ తర్వాత 'రాజుగారి గది 3'ని తెరకెక్కించారు. ఇందులో ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్ గా నటించారు. ఇది కూడా ఫరవాలేదనిపించింది. ఈ క్రమంలో 'రాజుగారి గది 4' చిత్ర నిర్మాణానికి దర్శకుడు ఓంకార్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.