Chandrababu: ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఓ జర్నలిస్టును అపహరించారు: చంద్రబాబు

  • జర్నలిస్టు ఇంటికి పోలీసులు వచ్చారన్న చంద్రబాబు
  • కుటుంబ సభ్యుల కళ్లెదుటే శివప్రసాద్ ను కిడ్నాప్ చేశారని వెల్లడి
  • పత్రికా స్వేచ్ఛ పట్ల బెదిరింపు అంటూ వ్యాఖ్యలు
Chnadrababu responds in Journalist Sivaprasad issue

ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు శివప్రసాద్ అనే పాత్రికేయుడ్ని పోలీసులు అపహరించారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. హైదరాబాదులోని అతని కుటుంబం కళ్లెదుటే జర్నలిస్టును కిడ్నాప్ చేశారని ట్వీట్ చేశారు. ఓ వ్యక్తి మానవ హక్కులను కాపాడే చట్టాన్ని సైతం అపహాస్యం చేస్తూ శివప్రసాద్ ను ఎత్తుకెళ్లారని విమర్శించారు. ఇది పత్రికా స్వేచ్ఛ పట్ల బెదిరింపు అని, ఈ ఘటనను తాను ఖండిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.


More Telugu News