Amit Shah: అమిత్ షాతో భేటీ.. ఐసొలేషన్ లోకి వెళ్లిన రవిశంకర్ ప్రసాద్

  • శనివారం అమిత్ షాతో భేటీ అయిన రవిశంకర్ ప్రసాద్
  • అమిత్ కు పాజిటివ్ అని నిన్న నిర్ధారణ
  • ఆయనను కలిసిన వారందరూ ఐసొలేషన్ లోకి వెళ్తున్న వైనం
Ravishankar Prasd went to self isolation

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నిన్న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమిత్ షాను శనివారం రవిశంకర్ ప్రసాద్ కలిశారు. దీంతో, ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తనను కలిసిన అందరూ ఐసొలేషన్ లోకి వెళ్లాలని, కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని అమిత్ షా సూచించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయనను కలిసిన పలువురు ఇప్పటికే ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు.

మరోవైపు, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది.

More Telugu News