Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • ఆ హీరోతో త్రిష పెళ్లంటూ వార్తలు 
  • మలయాళ రీమేక్ ఆగిందా?
  • కొబ్బరినూనెకు రాశిఖన్నా ప్రచారం
  • హిందీలోకి మరో తెలుగు సినిమా
Trisha to get married with Shimbu

*  అందాలతార త్రిష త్వరలో హీరో శింబుని వివాహమాడనుందంటూ కోలీవుడ్ లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. గతంలో 'ఏ మాయ చేసావే' తమిళ వెర్షన్ లో శింబు, త్రిష జంటగా నటించారు. ఇప్పుడు దీని సీక్వెల్ లో కూడా నటించనున్నారు. ఈ నేపథ్యంలో వినిపిస్తున్న వీరి పెళ్లి వార్తలో ఏపాటి నిజం వుందో త్వరలోనే తెలుస్తుంది.  
*  మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోశియం' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి నిర్మాత సూర్యదేవర నాగవంశీ హక్కుల్ని తీసుకున్న సంగతి విదితమే. ఇందులోని రెండు ప్రధాన పాత్రలలో ఓ పాత్రకు రానా దగ్గుబాటిని ఎంచుకోగా, మరో పాత్రకు ఇంకా ఎవరూ ఎంపిక కాలేదు. బాలకృష్ణ, రవితేజ.. ఇలా ఇద్దరు ముగ్గుర్ని అనుకున్నా ఎవరూ ఫైనల్ కాలేదు. దాంతో ప్రాజక్టును నిర్మాత ప్రస్తుతానికి హోల్డ్ చేసినట్టు తెలుస్తోంది.    
*  కథానాయిక రాశిఖన్నా చేతికి ఓ బ్రాండింగ్ వచ్చింది. 'ఎల్డియా ప్యూర్ కోకోనట్ ఆయిల్'కు ఆమె బ్రాండ్ అంబాసడర్ గా డీల్ కుదుర్చుకుంది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
*  నవీన్ పోలిశెట్టి హీరోగా స్వరూప్ దర్శకత్వంలో ఏడాది క్రితం వచ్చిన 'ఏజంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' చిత్రం తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. కొత్తతరహా కథా కథనాలతో సాగిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.  

More Telugu News