Corona Virus: తెలంగాణలో కొత్తగా 1,597 కరోనా కేసులు, 11 మంది మృతి

  • జీహెచ్ఎంసీ పరిధిలో 796 కొత్త కేసులు
  • తాజాగా 1,159 మంది డిశ్చార్జి
  • గత 24 గంటల్లో 11 మంది మృతి
corona cases in telangana increases

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 1,597 మందికి కరోనా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 39,342కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 796 కొత్త కేసులు వచ్చాయి. ఇవాళ 1,159 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 25,999కి పెరిగింది. ప్రస్తుతం 12,958 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో తాజాగా 11 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో మొత్తం మరణాలు 386కి పెరిగాయి.
.

More Telugu News