Tamilnadu: నోటికి తీవ్రగాయాలతో తమిళనాడులో ఏనుగు మృతి

  • కోయంబత్తూరు శివారులోని జంబుకండి గ్రామంలో 
  • చికిత్స అందించినా బతకని ఏనుగు
  • విచారణ ప్రారంభం
Tamil Nadu A 12 year old male elephant died

కేరళలో ఓ ఆడ ఏనుగు మృతి ఘటనను మరవక ముందే తమిళనాడులో ఇటువంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. 12 ఏళ్ల ఓ మగ ఏనుగు కోయంబత్తూరు శివారులోని జంబుకండి గ్రామంలో ప్రాణాలు కోల్పోయిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆ ఏనుగు నోటి గాయాలతో బాధపడుతోందని వివరించారు. ఈ విషయాన్ని గుర్తించి తాము దాన్ని రక్షించడానికి చికిత్స అందించి, ప్రయత్నించినప్పటికీ కాపాడలేకపోయామని తెలిపారు. ఆ ఏనుగు మృతికి గల కారణాలపై విచారణ ప్రారంభించామని వివరించారు.        
                       

More Telugu News